Page Loader
Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు 
ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు

Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మృతదేహం కనిపించడం, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఆందోళనకు గురి చేసింది. ఇంట్లో దుర్వాసన రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు మూసి ఉండటంతో, తాళాలు బద్దలుకొని తలుపు తెరిచి, ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేయడం గమనార్హం. పోలీసులు ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ, అద్దెకు ఇచ్చిన వ్యక్తి సంజయ్ పాటిదార్, ఇతర వివరాలు తెలుసుకున్నారు.

Details

దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు

2023 జూలైలో సంజయ్ పాటిదార్ ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కానీ 2024 జూన్‌లో ఇల్లు ఖాళీ చేశాడు. అయితే ఆయన కొన్ని వస్తువులను అక్కడే వదిలేసినట్లు దర్యాప్తులో తేలింది. సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలు ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నాడు. ఆమె వివాహం కోసం ఒత్తిడి పెట్టడంతో 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచడంతో పాటు, సంజయ్ పాటిదార్, అతని స్నేహితుడు వినోద్ దేవ్‌ సాయాన్ని తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.