NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 
    తదుపరి వార్తా కథనం
    Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 
    వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

    Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2024
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ ప్రభుత్వం వస్త్ర రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ రంగానికి సంబంధించి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టెక్స్‌టైల్స్, అపెరల్స్, గార్మెంట్స్ పాలసీని ప్రవేశపెట్టింది.

    ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, అలాగే రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

    2014-29 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతులను 1 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకుంది.

    పరిశ్రమలను ఎంఎస్‌ఎంఈ, సబ్‌లార్జ్, లార్జ్, మెగా అనే నాలుగు కేటగిరీలుగా విభజించి, వాటికి అనుగుణంగా ప్రోత్సాహాలను ప్రకటించింది.

    Details

    వందశాతం స్టాంప్ డ్యూటీ

    స్థిర మూలధన పెట్టుబడిపై 8-10% రాయితీ అందజేస్తారు. ఈ రాయితీని ఉత్పత్తి ప్రారంభం నుండి ఐదేళ్లపాటు సమాన వార్షిక వాయిదాల్లో చెల్లిస్తారు.

    పరిశ్రమల కోసం కొనుగోలు చేసే భూమిపై వందశాతం స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకాన్ని తిరిగి చెల్లిస్తుంది.

    ఇక మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

    రూ.200 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రాజెక్టు ప్రాముఖ్యత, ఉపాధి కల్పన ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తారు.

    రాష్ట్రంలో టెక్స్‌టైల్స్, అపెరల్స్, గార్మెంట్స్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల స్థాపనకు మద్దతు ఇస్తారు.

    Details

    ఎలక్ట్రిసిటీ డ్యూటీలో 50శాతం మినహాయింపు

    సబ్‌లార్జ్, మెగా పరిశ్రమల కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుండి ఆరేళ్లపాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీలో 50శాతం మినహాయింపు ప్రకటించనుంది.

    స్థానికంగా ముడిపదార్థాలను సేకరించిన పరిశ్రమలకు వార్షిక టర్నోవర్‌లో 1% లేదా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు.

    రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలకు మలుపు తిప్పనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..? భారతదేశం
    CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు
    Jayamangala venkata ramana: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్ బై చెప్పిన కైకలూరు ఎమ్మెల్సీ వై.ఎస్.జగన్
    AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు ఇండియా

    ప్రభుత్వం

    TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ తెలంగాణ
    Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం తెలంగాణ
    Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ తెలంగాణ
    KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025