Page Loader
కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. కడు గ్రామానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ తన పెద్ద కుమార్తె నిర్మ(32)ను పదునైన ఆయుధంతో గొంతు కోసి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాజస్థాన్‌(Rajasthan)లోని పాలి జిల్లాలోని సిరియారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. భార్యాపిల్లలతో విభేదాల కారణంగా నిందితుడు గత 12 ఏళ్లుగా పాలిలో ఒంటరిగా ఉంటున్నాడని, భార్యాపిల్లలు గుజరాత్‌లో నివసిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మృతురాలు తన పెద్ద కుమార్తె నిర్మ కారణంగానే తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని నిందితుడు భావించి హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల విచారణలో తేలిందని వెల్లడించారు.

రాజస్థాన్

చిన్న కుమార్తె అక్క ఏది అడగడంతో.. 

నిర్మ సోమవారం పాలిలోని ఇసలి గ్రామంలో వివాహ వేడుకకు హాజరైంది. ఈ వేడుకలో తండ్రిని నిర్మ కలుసుకుది. ఈ క్రమంలో శివలాల్ తన పెద్ద కుమార్తె, చిన్న కుమార్తెను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక.. చిన్న కూతురును మధ్య వదిలేసి అక్కడే ఉండమని చెప్పి.. పెద్ద కుమార్తెను బైక్‌పై తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెద్ద కుమార్తెను చంపేశాడు. శివలాల్ తిరిగి తన చిన్న కుమార్తె దగ్గరికి వచ్చాడు. ఈ సమయంలో శివలాల్ చేతికి రక్తం ఉండటాన్ని చిన్న కుమార్తె గుర్తించింది. అలాగే అక్క ఏదని ఆమె అడగటంతో.. శివలాల్ అక్కడి నుంచి పారిపోయారు. ఇదే సమయంలో సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులను సమాచారం ఇచ్చారు.