NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌
    తదుపరి వార్తా కథనం
    Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌
    ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

    Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    08:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్‌ సాధించారు.

    చెన్నై పేటెంట్‌ సంస్థ ఈ పేటెంట్‌ను మంజూరు చేసింది. మంగళవారం ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌ చేతుల మీదుగా ఆచార్య కృష్ణ ఈ పేటెంట్ పత్రాన్ని అందుకున్నారు.

    పులస చేపలోని ప్రొటీన్లు, కొవ్వు తదితర పోషకాలపై తన పరిశోధన వివరాలు ఆచార్య కృష్ణ తెలియజేశారు.

    ఈ చేప ప్రత్యేకించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఔషధంగా పనిచేస్తోందని తెలిపారు.

    పరిశ్రమల వ్యర్థాలు గోదావరి నదిలో కలవడం వల్ల ఈ అరుదైన చేపల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    Details

    పులస పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

    పులస పరిరక్షణపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.

    ఇప్పటివరకు నదులలో లభించే వివిధ చేపలపై 130కు పైగా జర్నల్‌ వ్యాసాలు ప్రచురించి, 120 సదస్సులు, అనేక వర్క్‌షాప్‌లు ఆచార్య కృష్ణ నిర్వహించారు.

    కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్‌ ఆచార్య రత్నశీలామణి, రిజిస్ట్రార్‌ ఆచార్య సింహాచలం, సీడీఈ డైరెక్టర్‌ ఆచార్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోదావరి నదీ

    తాజా

    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక నరేంద్ర మోదీ
    APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత ఆస్ట్రేలియా
    Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా?  మహ్మద్ షమీ

    గోదావరి నదీ

    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు గంగపుత్రులు
    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం భద్రాచలం
    డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద  తెలంగాణ
    గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్! గుంటూరు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025