Page Loader
PM Modi: భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన! 
భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన!

PM Modi: భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల భారత్‌ను ట్రకోమా (Trachoma) లేని దేశంగా ప్రకటించిన నేపథ్యంలో దీనికి తోడ్పడిన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా అందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ఆదివారం ప్రసారమైన 123వ ఎపిసోడ్‌లో మోదీ పలు ముఖ్య అంశాలపై మాట్లాడారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచమంతటా యోగా కార్యక్రమాల్లో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. యోగా కార్యక్రమం మొదలై దాదాపు దశాబ్దంగా ఇది విశేష విస్తరణ పొందిందని, అనేకమంది తమ జీవనశైలిలో యోగాన్ని భాగంగా చేసుకున్నారని పేర్కొన్నారు.

Details

వీరుల త్యాగాలను గుర్తించుకోవాలి

అలాగే దేశం గతంలో ఎదుర్కొన్న ఎమర్జెన్సీ పరిస్థితిని గుర్తు చేశారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో విధించిన ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగాన్ని హత్య చేయడమే కాకుండా న్యాయవ్యవస్థను కూడా గెలిపించుకునే ప్రయత్నం జరిగిందని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో నేత జార్జి ఫెర్నాండెజ్‌ను సంకెళ్లతో బంధించారని చెప్పారు. అయితే భారత ప్రజల ప్రజాతంత్ర విశ్వాసంతో ఎమర్జెన్సీకి తెరపడిందని, ఆ నిర్ణయం తీసుకున్న వారు ఓడిపోయారని మోదీ అన్నారు. అంతేగాక, మోరార్జీ దేశాయ్, వాజ్‌పేయి, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వీరుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. బోడోల్యాండ్ ప్రాంతానికి చెందిన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

Details

నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలి

పరిమిత వనరుల మధ్య తాము ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసనీయమని అన్నారు. ఈ ఆటగాళ్లు దేశంలోని చిన్నారులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్, ఆరోగ్యం దృష్ట్యా ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాదు మేఘాలయకు చెందిన ఎరీసిల్క్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిన విషయాన్ని వెల్లడించారు. దీనిలో పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకతగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని బౌద్ధ క్షేత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును వివరించారు. ఈ ప్రాంతాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలని సూచించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సేవలు అందిస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధాని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.