NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
    తదుపరి వార్తా కథనం
    Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
    రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!

    Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

    బుధవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వార్ రూమ్‌ను సందర్శించి, ప్రయాగ్‌రాజ్‌లోని ఎనిమిది రైల్వే స్టేషన్లలో జనసమూహ నిర్వహణ పరిస్థితిని సమీక్షించారు.

    అలాగే యాత్రికుల రవాణా కోసం ప్రత్యేక రైళ్లను నడిపేలా అధికారులను ఆదేశించారు.

    రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, రెండు రోజుల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి 568 రైళ్లు నడిపి, 27.08 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేశారు.

    ఫిబ్రవరి 12 సాయంత్రం 6 గంటల వరకు 225 రైళ్లలో 12.46 లక్షల మంది ప్రయాణికులు, ఫిబ్రవరి 11న 343 రైళ్లలో 14.69 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.

    Details

    యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు 

    బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఈఓ, సీఆర్‌బీ సతీష్ కుమార్‌తో కలిసి వార్ రూమ్‌కు చేరుకుని, ప్రయాగ్‌రాజ్‌లో రైళ్ల నిర్వహణను పర్యవేక్షించారు.

    యాత్రికులకు పూర్తి సౌకర్యాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు రైళ్లను నడిపి రద్దీని తగ్గించాలని సూచించారు.

    ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద 5,000 సామర్థ్యం గల నాలుగు హోల్డింగ్ ఏరియాలు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఖుస్రో బాగ్‌లో కొత్త హోల్డింగ్ ఏరియా (100,000 మంది సామర్థ్యంతో) ప్రారంభమైంది.

    రైళ్ల సమాచారం కోసం సోషల్ మీడియా, ప్రత్యేక బులెటిన్‌లు, స్టేషన్ ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి.

    రైల్వే శాఖ మహా కుంభమేళా భక్తులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం

    ఉత్తర్‌ప్రదేశ్

    Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్'  భారతదేశం
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఇండియా
    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025