NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!
    రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!

    PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2025
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

    ఈ సందర్భంగా రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ వంతెన మీదుగా ప్రయాణించనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన చీనాబ్ నదిపై తలెత్తింది.

    మొత్తం రైల్వే లింక్ పొడవు 272 కిలోమీటర్లు కాగా, చివరి దశగా కాట్రా-సంగల్దాన్ స్ట్రెచ్‌ను మోదీ ప్రారంభించనున్నారు.

    అనంతరం శ్రీనగర్-కాట్రా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హరిపత్రం ఊపనున్నారు.

    Details

    మెరుగైన రవాణా వసతి సౌకర్యం

    ఈ లింక్‌తో న్యూఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడనుంది.

    ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేవారికి మెరుగైన రవాణా వసతిని కల్పించనుంది.

    ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 43,780 కోట్లు. ఈ మార్గంలో మొత్తం 31 రైల్వే స్టేషన్లు, 36 టన్నెల్స్, 943 వంతెనలు ఉన్నాయి.

    ప్రారంభోత్సవం రోజున శ్రీనగర్-కాట్రా, కాట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లు సేవలు ప్రారంభిస్తాయి.

    Details

    భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం

    రైల్వే శాఖ ఈ వంతెనను ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తోంది.

    ఈ వంతెన ఎత్తు 369 మీటర్లు - ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలిచింది.

    గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే సామర్థ్యంతో రూపొందించబడింది. నిర్మాణంలో 30,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు.

    ఈ వంతెన భూకంపాలకు అధిక ప్రమాదం ఉన్న ఫాల్ట్ జోన్ ప్రాంతంలో నిర్మించారు. అయినప్పటికీ, భూకంపాల్ని తట్టుకునే మన్నికతో నిర్మించామని రైల్వే బోర్డు వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    నరేంద్ర మోదీ

    PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ భారతదేశం
    CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ రేవంత్ రెడ్డి
    PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం భారతదేశం
    PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం ఉత్తర్‌ప్రదేశ్

    ఇండియా

    Smita Sabharwal: వ్యవసాయ వర్సిటీ కీలక నిర్ణయం.. స్మితా సభర్వాల్‌కి నోటీసులు..? భారతదేశం
    Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు! తెలంగాణ
    Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి ఇన్ఫోసిస్
    Haryana: హర్యానాలో భారీ పేలుడు కలకలం.. నలుగురు కుటుంబ సభ్యులు మృతి హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025