అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!
అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు. గోల్పరాలో జోనాలి నాథ్ ప్రస్తుతం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జోనాలి నాథ్ జాతీయ రహదారి-17 సమీపంలో పడవేయడంపై తగిన దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను బీజేపీ కోరింది. జోనాలి నాథ్ మృతదేహం పడి ఉన్న దృశ్యాలను బట్టి ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే , పార్టీ సీనియర్ నేత హేమంగా ఠాకూరియా జోనాలి నాథ్ మృతిపై స్పందించారు. ఇది హత్య అయితే, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని అన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించినట్లు, తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ రెడ్డి వెల్లడించారు.