LOADING...
Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు
అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు

Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త రహదారి పనులపై కూడా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని వాహనదారుల అవసరాలను బట్టి పలు జాతీయ రహదారులను విస్తరించడానికి ఎన్‌హెచ్ఎఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అనకాపల్లి నుంచి తూర్పుగోదావరి వరకు 16వ నేషనల్ హైవేను ప్రస్తుతం నాలుగు లైన్‌ల నుండి ఆరు లైన్‌లుగా మార్చేందుకు సిద్ధమైంది. ప్రాజెక్ట్ స్థలం అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో ముగుస్తుంది. మొత్తం 160 కిలోమీటర్ల విస్తరణలో రూ.3800 కోట్లు ఖర్చు పడనుందని తెలిపారు. విస్తరణలో కొత్త బైపాస్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మాణం కూడా ఉండనుంది.

వివరాలు

ఆరు లైన్‌ల హైవే నిర్మాణం

విస్తరణలో 11 కొత్త ఫ్లైఓవర్లు, 3 బైపాస్‌లు, 5 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ హైవే ట్రాఫిక్ రద్దీతో తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం విస్తరణ చేపట్టడంలో ఎన్‌హెచ్ఎఐ ముందడుగు వేసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వడ్డిమెట్ల నుంచి చేపూరు వరకు 7.7 కిలోమీటర్ల బైపాస్, ఎర్రవరం వద్ద 3 కిలోమీటర్ల బైపాస్, జగ్గంపేట దగ్గర 10 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం కూడా ప్రాజెక్టులో భాగం. స్థానిక ఎమ్మెల్యేల వినతుల తరువాత ఈ నిర్ణయం తీసుకోబడింది.

వివరాలు

విశాఖ, విజయవాడ రూట్లకు లాభం

ఈ విస్తరణ తర్వాత, విజయవాడ-విశాఖపట్నం మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యం అవుతుంది. ప్రాజెక్ట్‌లో తేటగుంట క్రాస్ రోడ్, అన్నవరంలో ఇరువైపులా సర్వీస్ రోడ్లు, ప్రతిపాడు అండర్ పాస్ విస్తరణ, జెడ్ రంగంపేట దగ్గర అండర్ పాస్ నిర్మాణం, ఇతర కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం రాష్ట్రంలో జాతీయ రహదారుల ఆధునికీకరణకు దోహదం చేస్తూ, ప్రయాణికులకు విశేష లాభాన్ని అందిస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement