NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..! 
    ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..!

    AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని)సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

    ఈ దిశగా,ముందుగా ఎంత మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఓ సర్వే చేపట్టింది.

    ఈ సర్వే ద్వారా పొందిన అభిప్రాయాల ఆధారంగా, రాష్ట్రంలోని పలు శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    ప్రస్తుతం,రాష్ట్రంలో తగిన సదుపాయాలు కల్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారా లేదా అనే అంశంపై సర్వే కొనసాగుతోంది.

    ఈ సర్వేలో ఇంటర్,డిగ్రీ,డిప్లమో, ఇతర విద్యార్హతలు కలిగిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులను చేర్చారు.

    వివరాలు 

    కోటి మందిపై పూర్తైన సర్వే 

    సుమారు 25 లక్షల మంది యువతీ యువకులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

    ఈ వివరాలను కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు.

    ఏపీ రాష్ట్రంలో మొత్తం 2.68 కోట్ల మంది 18-50 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రజలు ఉన్నట్లు అంచనా.

    వారిలో దాదాపు కోటి మందిపై ఈ సర్వే పూర్తయింది.అందులో, 11లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు,13లక్షల మందికి పైగా డిప్లమో లేదా అంతకన్నా అధిక విద్యార్హతలు కలిగినవారు ఉన్నారు.

    వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అందించేందుకు 118ప్రభుత్వ భవనాలను గుర్తించారు.

    వివరాలు 

    త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం

    అంతేకాక, ఇప్పటికే 2.13 లక్షల మంది హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని సర్వేలో తేలింది.

    త్వరలో సర్వే పూర్తయ్యాక, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఆంధ్రప్రదేశ్

    Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్‌.. ఈ నెల 20 వరకు రిమాండ్‌ జనసేన
    Shakti App: 'శక్తి' యాప్‌ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు చంద్రబాబు నాయుడు
    Andhra Pradesh: ఏపీలో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం అమరావతి
    AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి! తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025