కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఘటన
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో శనివారం 3 అంతస్తుల భవనం కులకూలినట్లు అధికారులు తెలిపారు. మంగళ చౌక్ సమీపంలో ఉదయం 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. డ్రెయినేజీ లైను ఏర్పాటు కోసం తవ్వకాలు జరుగుతుండగా మూడు అంతస్తులో ఉన్న శ్రీరామ్ మెడికల్ షాపు కుప్పకూలిందని స్థానికులు ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై విన్నవించినా పట్టించుకోలేదని యజమాని విశాల్ గుప్త వాపోయారు.