Page Loader
పాకిస్థాన్‌లో మృతి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే 
పాకిస్థాన్‌లో మృతి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే

పాకిస్థాన్‌లో మృతి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2023
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే డిసెంబర్ 2న పాకిస్థాన్‌లో మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రోడేకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. సిక్కు ఆచారాలు,సంప్రదాయాలను అనుసరించి పాకిస్తాన్‌లో రోడే అంత్యక్రియలు రహస్యంగా నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. భింద్రన్‌వాలే ఖలిస్తాన్ ఉద్యమానికి పూర్వపు నాయకుడు. లఖ్‌బీర్ సింగ్ రోడే పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పంజాబ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని పాక్ రహస్య సంస్థ ఐఎస్ఐ సంకేతాలు అందాయి.

Details 

నిషేధిత సంస్థకి రోడే అధిపతి

అక్టోబరులో,జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రవాద నిరోధక సంస్థ చేసిన దాడి తరువాత రోడే ఆస్తులను జప్తు చేసింది. పంజాబ్‌లోని మోగాలో సోదాలు జరిగాయి. 2021- 2023 మధ్య తీవ్రవాద-సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు రోడేపై ఆరు కేసులను దర్యాప్తు చేస్తున్నందున ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ ఈ చర్య తీసుకుంది. రోడే నిషేధిత సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ISYF)కి అధిపతి. ఈ సంస్థను ప్రభుత్వం తీవ్రవాదుల గ్రూప్ గా గుర్తించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే  మృతి