NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు
    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

    Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు.

    రాష్ట్రంలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఆధార్ నమోదు కోసం ప్రత్యేక క్యాంపులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలు తీసుకుంటోంది.

    ఈ మేరకు, ప్రభుత్వ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

    రాష్ట్రంలో మొత్తం 11,65,264 మంది చిన్నారులు ఉన్నారు. అందులో నేటి వరకూ 9,80,575 మంది చిన్నారులు ఆధార్ నమోదు చేయించుకోలేదు.

    వివరాలు 

    రెండు విడతలలో ఆధార్ నమోదు 

    ఈ ప్రత్యేక క్యాంపులు రెండు విడతలలో నిర్వహించబడతాయి. మొదటి విడత క్యాంపులు జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించనున్నారు.

    ఈ క్యాంపులలో, పూర్వ విద్యార్థులు, అంగన్‌వాడీ సెంటర్లు, సచివాలయాలు, పోస్టాఫీసులు, సి.ఎస్.సి కేంద్రాలు ఆధార్ నమోదుకు సౌకర్యం అందించనున్నాయి.

    ప్రత్యేక క్యాంపుల నిర్వహణ

    ఈ క్యాంపులు గ్రామ, వార్డు సచివాలయాల డిపార్ట్‌మెంట్, ఆధార్ ఆపరేటర్లతో సమన్వయంగా నిర్వహించబడతాయి.

    రాష్ట్ర గ్రామ సచివాలయ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్, జిల్లా కలెక్టర్లకు, ఇతర సచివాలయ అధికారులకు లేఖ రాసారు.

    జనవరి 24 వరకు నాలుగు రోజుల పాటు క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

    వివరాలు 

    రెండవ విడత క్యాంపులు 

    రెండవ విడత క్యాంపులు జనవరి 27 నుండి 30 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడతాయి.

    మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) మరియు మున్సిపల్ కమిషనర్లు ఈ క్యాంపులను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

    ముఖ్యమైన సూచనలు

    చిన్నారుల ఆధార్ నమోదుకు పుట్టిన తేదీ సర్టిఫికేట్, క్యూర్ కోడ్‌ను తీసుకెళ్లాలి.

    దరఖాస్తు ఫారం ఉండాలి.

    పిల్లలను తల్లి లేదా తండ్రే క్యాంపుకు తీసుకెళ్లాలి.

    ఇతరులు పిల్లలను క్యాంపుకు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

    తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

    చిన్నారుల ఆధార్ నమోదు ఉచితంగా, ఎటువంటి రుసుము లేదు.

    ఈ చర్యలు అన్ని జిల్లాలలో సమగ్రంగా అమలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష భారతదేశం
    AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం కర్ణాటక
    Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ పోలవరం
    Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన! శ్రీశైలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025