LOADING...
Aadhaar: ఆధార్‌ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం
ఆధార్‌ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం

Aadhaar: ఆధార్‌ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబరులో జిల్లా పాఠశాలల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్‌ శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనకపోవడంతో, మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 నుంచి 17 ఏళ్ల మధ్య పిల్లలకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ఉచితంగా ఆధార్‌ సేవలు అందిస్తారు. గుర్తింపు, నివాస ధ్రువీకరణను ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్‌ చేయాలని ఉడాయ్‌ (UIDAI) సూచిస్తోంది. విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. ఫిబ్రవరిలో నెట్‌-2026 నమోదు ప్రక్రియ మొదలవుతున్నందున కొన్ని జాతీయ ప్రవేశ పరీక్షలకు కూడా ఆధార్‌ నవీకరణ తప్పనిసరి. ఉడాయ్‌ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 1,09,000 బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (EMBU) పెండింగ్‌గా ఉన్నాయి.

Details

 17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం

దీని దృష్ట్యా, సోమవారం నుండి జిల్లా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. తరువాత పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లు వరకు పిల్లలకు 'బాల ఆధార్‌' జారీ చేస్తారు, ఇది ఫొటో, పేరు, పుట్టిన తేదీ ఆధారంగా తయారవుతుంది. ఈ వయసులో ఐరిస్‌, వేలి ముద్రలు తీసుకోబడవు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పిల్లలు 5 ఏళ్లు పూర్తి అయిన వెంటనే బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (EMBU) తప్పనిసరిగా చేయాలి. EMBUని 5-7 ఏళ్లలోపు చేస్తే సేవలు ఉచితం. ఈ ప్రక్రియ ద్వారా పిల్లల ఆధార్‌ నంబరులో ఎలాంటి మార్పు ఉండదు. 7 ఏళ్లు అయిన తర్వాత అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ గుర్తింపు రద్దు చేయబడే అవకాశముంది.

Details

మ్యాపింగ్‌ పూర్తి

EMBU ఎక్కువగా పెండింగ్‌ ఉన్న పాఠశాలలకు ముందుగా కిట్లు పంపించనున్నాం. ఇప్పటివరకు మ్యాపింగ్‌ పూర్తి అయింది. పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల EMBU పూర్తి చేయడం తప్పనిసరి అని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారి ఉషారాణి పేర్కొన్నారు.

Advertisement