Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా.. బీజేపీపై ఆప్ విమర్శలు
కాంగ్రెస్,ఆప్ కి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రకారం,ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే, మేయర్ ఎన్నిక వాయిదాపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఎన్నికల వాయిదాపై పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో భాజపానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. 'బీజేపీ గెలిచినప్పుడే ఎన్నికలు జరుగుతాయని, బీజేపీ ఓడిపోతే ఎన్నికలు వాయిదా పడేలా మన ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందా' అని చద్దా ప్రశ్నించారు. ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో "ఈరోజు ఎన్నికలు జరగవని" తమకు సమాచారం అందిందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ కుమార్ బన్సాల్ గురువారం పేర్కొన్నారు.
మేయర్ పదవికి ఆప్,సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్
మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ,ఇండియా బ్లాక్ సభ్యులు ఇద్దరూ చేతులు కలిపారు. కాంగ్రెస్-ఆప్ పొత్తులో భాగంగా మేయర్ స్థానానికి ఆప్ పోటీ చేయగా, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో, BJP 14 కౌన్సిలర్ స్థానాలను కలిగి ఉంది. అదనపు ఎక్స్-అఫీషియో సభ్యురాలు MP (కిరోన్ ఖేర్) ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఆప్కు 13 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్కు ఏడు స్థానాలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో శిరోమణి అకాలీదళ్కు ఒక కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.