NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
    ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 11, 2025
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, దీని వల్ల లక్షల మందికి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

    ప్రభుత్వాలు పెద్దపెద్ద పథకాలు అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, అందులో కొన్ని లొసుగులు ఉండడం సహజమే.

    పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎక్కడో ఒకచోట అక్రమాలు జరుగుతుండటమే అనేక సమస్యలకు కారణమవుతోంది.

    గత వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ అక్రమాలన్నింటినీ తేల్చి చెప్పేందుకు సిద్ధమైంది.

    ఇప్పటికే పెన్షన్ లబ్దిదారుల విషయంపై పరిశీలన జరుగుతుండగా, మరోవైపు పేదలకు అందజేసిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై కూడా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.

    Details

    ఇళ్ల పంపిణీలో భారీ అక్రమాలు

    వైసీపీ పాలనలో అనేక మంది అక్రమ మార్గాల్లో ఇళ్ల పట్టాలను పొందారు. కొంతమంది అయితే ఒక్కొక్కరు రెండు, మూడు ఇళ్ల పట్టాలను పొందారని ప్రభుత్వం గుర్తించింది.

    పేదలం అంటూ నకిలీ పత్రాలను సమర్పించి, అధికారులతో కుమ్మక్కై ఇళ్ల స్థలాలను దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

    ఇప్పుడు ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది.

    ఈ ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఇది నెలల తరబడి సాగదు, కేవలం 5 రోజుల్లోనే పూర్తవుతుంది.

    Details

    సర్వే ప్రక్రియ మొదలు 

    గత ప్రభుత్వం ఎంత మందికి ఇళ్లు, స్థలాలు కేటాయించిందన్న వివరాలు ఇప్పటికే రెవెన్యూ అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నాయి. లబ్దిదారుల పూర్తి వివరాలతో జాబితా రెడీగా ఉంది.

    ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు 5 రోజుల గడువు విధించింది.

    ఫిబ్రవరి 10 నుంచి 15 వరకూ సంపూర్ణంగా సర్వే చేసి నివేదిక అందించాలని ఆదేశించింది.

    దీంతో కలెక్టర్లు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలు, మండలాల్లో ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారో, వారు సమర్పించిన పత్రాలన్నింటినీ క్రాస్ చెక్ చేస్తున్నారు.

    Details

    తప్పుడు లబ్ధిదారులపై దర్యాప్తు

    ఆఫీసుల్లో జరిగిన ప్రాథమిక పరిశీలన అనంతరం, అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్దిదారులను స్వయంగా కలుసుకుంటారు.

    వారు నిజమైన లబ్దిదారులా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. అదనంగా, లబ్దిదారుల ఐడీ ప్రూఫ్‌లు, పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు.

    ఇళ్ల స్థలాలు పొందిన వ్యక్తులు, వాటిని ఇప్పటికీ కలిగి ఉన్నారా లేదా అమ్మేశారా అనే అంశాన్ని కూడా గుర్తిస్తారు.

    అక్రమంగా అమ్మిన స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది. దాంతో ఆ స్థలాలను కొనుగోలు చేసిన వారికి ఇది పెద్ద షాక్ కానుంది.

    Details

    ఒక ఇంట్లో ఒకరికే ఇళ్లు 

    ఒకే ఇంట్లో పలువురు వ్యక్తులు ఇళ్ల పట్టాలను పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.

    గత వైసీపీ ప్రభుత్వం ఒక ఇంట్లో ఒకరికే పట్టా ఇవ్వాలనే నిబంధనను అమలు చేయాలని చెప్పినప్పటికీ, కొన్ని చోట్ల అది ఉల్లంఘించబడినట్లు కనిపిస్తోంది.

    ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అధిక లబ్ధి పొందినట్లయితే, వారిపై కఠిన చర్యలు తప్పవు.

    లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలి

    ప్రభుత్వం సర్వేను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనుంది. అధికారుల విచారణ సమయంలో లబ్దిదారులు తమ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

    అధికారుల ప్రశ్నలకు సమాధానంగా అన్ని ఐడీ ప్రూఫ్‌లు, సంబంధిత డాక్యుమెంట్లను చూపించగలగాలి.

    ఇలా పత్రాలు సిద్ధంగా ఉంచుకుంటే, అధికారుల సోదాల్లో అవి తక్షణమే చూపించేందుకు వీలవుతుంది.

    Details

    రిపోర్ట్ అనంతరం చర్యలు

    సర్వే పూర్తయిన 5 రోజుల్లోనే అధికారులు నివేదిక అందించనున్నారు.

    ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తప్పుడు లబ్దిదారులపై చర్యలు తీసుకుని, అక్రమంగా పొందిన ఇళ్ల స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.

    వాటిలో పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలు ఉంటే తొలగించి, అసలైన పేదలకు తిరిగి అందించనుంది.

    ఈ విధంగా, ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం లక్షలాది మంది అక్రమ లబ్దిదారులకు పెద్ద షాక్ ఇస్తుందని, నిజమైన లబ్దిదారులకు న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైసీపీ

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ శ్రీకాకుళం
    Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం  చంద్రబాబు నాయుడు
    AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు  భారతదేశం
    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి  భారతదేశం

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి.. కింజరాపు అచ్చన్నాయుడు
    Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు  ఆంధ్రప్రదేశ్
    Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి చంద్రబాబు నాయుడు
    Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్ చంద్రబాబు నాయుడు

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025