Page Loader
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ

INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై 'ఇండియా' కూటమిలోని పార్టీలు చర్చించనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన ప్రచారం వ్యూహం, సీట్ల పంపకం, ఎంపీల సస్పెన్షన్‌పై ఇండియా కూటమి చర్చించే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్షన్‌ ప్లాన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇండియా

చరిత్రలో మొదటిసారిగా ఒక్క సెషన్‌లో 78మంది సస్పెండ్

డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాలు చేపట్టిన నిరసనలు, నివాదాల నేపథ్యంలో వారం వ్యవధిలో 92 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభ నుంచి సోమవారం ఒక్క రోజే 78మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఒక్క సెషన్‌లో ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎంపికపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు.