NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన
    తదుపరి వార్తా కథనం
    Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన
    హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన

    Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 03, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంపై దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనకు దిగారు.

    అయితే కేంద్ర ప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘ చర్చలు సఫలం కావడంతో ట్రక్కు డ్రైవర్లు సమ్మెను విరమించారు.

    కేంద్ర ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆల్-ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళన విరమించింది.

    కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత డ్రైవర్లు విధులు చేరాలని ట్రక్కర్లు కోరారు.

    తాము ఇంకా కొత్త చట్టాలన్ని అమలు చేయలేదని, పదేళ్ల శిక్ష, జరిమానాను తాత్కలికంగా నిలివేసినట్లు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు.

    Details

    కొత్త చట్టంపై డ్రైవర్ల ఆందోళన

    దీంతో హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది.

    కొత్త చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

    ఒక వేళ పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతే కాకుండా రూ.7లక్షల జరిమానా పడే అవకాశం ఉంది. ఇలాంటి కేసులు సెక్షన్ 304ఏ కిందకు వస్తాయి.

    ఇక కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్ష ఎక్కువ కాలం ఉండటంతో పాటు జరిమానా భారీగా ఉండటంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఇండియా

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    కేంద్ర ప్రభుత్వం

    స్వలింగ పెళ్లిలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు : లా కమిషన్ న్యాయ శాఖ మంత్రి
    POCSO Act : లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సు 18 ఏళ్లే.. మార్చకూడదన్న లా కమిషన్ న్యాయస్థానం
    5 ఏళ్ల RDపై వడ్డీ పెంచిన కేంద్రం.. కానీ పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు మాత్రం యాథాతథం ఆర్థిక శాఖ మంత్రి
    పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు ఈపీఎఫ్ఓ

    ఇండియా

    ONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్‌డీసీ వ్యాపారం
    కొంత కాలానికి భారత్‌తో సంబంధాలు బలహీన పడొచ్చు: అమెరికా రాయబారి అమెరికా
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇరాన్
    NEET Syllabus 2024 : నీట్ నూతన సిలబస్‌ను రిలీజ్ చేసిన ఎన్‌ఎంసీ ఇండియా లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025