Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్లో గతేడాది చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) విమానయాన సంస్థకు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి భారీ పరిహారం లభించింది. ఇన్సూరెన్స్ వర్గాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఎయిర్లైన్కు రూ.1,100 కోట్లకు పైగా చెల్లించబడినట్లు వెల్లడించారు ఆంగ్ల మీడియా కథనం కూడా ఇదే విషయాన్ని వివరించింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 12, గత సంవత్సరం, అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్పై పడింది.
Details
25 మిలియన్ డాలర్లు చెల్లించే ప్రక్రియ
ఈ ఘోర ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం నేపథ్యంలో బీమా కంపెనీలు, రీఇన్సూరర్లు 125 మిలియన్ డాలర్లు (రూ.1,100 కోట్లకు పైగా) బీమా మొత్తాన్ని చెల్లించాయి. అదనంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారంగా 25 మిలియన్ డాలర్లు చెల్లించే ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ఈ పరిహారం చెల్లింపు ఇంకా మొత్తం పూర్తికావలసి ఉంది. ఇక మొత్తంలో పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉందని ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి.