NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా
    తదుపరి వార్తా కథనం
    బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా
    గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా

    బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 28, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాజధాని బెంగళూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహానగర పరిధిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఈ మేరకు కన్నడ నాట గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ విమానం ఎక్కలేకపోయారు. ఫలితంగా ఫ్లైట్ బయల్దేరి వెళ్లిపోయింది.

    బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గవర్నర్ విమానశ్రయానికి తరలివచ్చారు.హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ లో నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంది.

    అప్పటికే ఆయన ఎక్కాల్సిన ఎయిర్ ఏషియా విమానంలోకి సిబ్బంది లగేజీని తరలించారు. గవర్నర్ విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్- 2కు కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. ఫ్లైట్ షెడ్యూలుకు 15 నిమిషాల ముందు వీఐపీ లాంజ్ కు వచ్చిన ఆయన్ను విమానయాన సిబ్బంది ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించలేదు.

    DETAILS

    మరో విమానం కోసం 90 నిమిషాలు నిరీక్షించిన గవర్నర్  

    ఈ క్రమంలోనే ఏయిర్ ఏషియా విమానం టేక్ ఆఫ్ అయ్యింది. దీంతో విమానాశ్రయంలోని లాంజ్ లో మరో విమానం కోసం గవర్నర్ నిరీక్షించాల్సి వచ్చిందని రాజ్ భవన్ ప్రకటించింది.

    రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ పట్ల సదరు సంస్థ ప్రొటోకాల్ ఉల్లంఘించిందని ప్రోటోకాల్ అధికారులు వెల్లడించారు.ఈ మేరకు ఎయిర్‌పోర్టులోని పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    మరోవైపు విమానాశ్రయ అధికారులను సంప్రదించగా, తాము ఎయిర్‌లైన్స్ సంబంధిత విషయాలపై స్పందించలేమని, పూర్తి వివరాల కోసం సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియానే అడగాలన్నారు.

    విషయం తెలుసుకున్న ఎయిర్‌ ఏషియా విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. రాజ్ భవన్ తో మెరుగైన సంబంధాలకు అత్యంత విలువనిస్తామని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ విమానాశ్రయం
    ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025