Page Loader
కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు 
కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ విఫలంతో గోవాకు తరలింపు

కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 27, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక తీరం నుంచి కీలక శాస్త్రవేత్తలతో బయలుదేరిన ఓ నౌక సాంకేతిక సమస్యలతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది. సముద్ర పరిశోధనలు చేపట్టేందుకు కర్ణాటకలోని కర్వార్ తీరం నుంచి బయలుదేరి వెళ్లిన ఈ నౌకలో ఇంజిన్ ఫెల్యూర్ సమస్య తలెత్తింది. దీంతో సముద్ర జలాల్లో ఎటు కదల్లేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది. నౌకలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (CSIR)కు చెందిన 8 మంది సైంటిస్టులుతో కలిపి మొత్తం 34 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ వెంటనే రంగంలోకి దిగింది. CSIRకే చెందిన ఆర్‌వీ సింధూ సాధన అనే పరిశోధక నౌకలో 8 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, 26 మంది సిబ్బందితో సముద్ర ప్రయాణం ప్రారంభించింది.

details

సముద్రంలోకి ఇంధనం లీకేజీ అవుతుండటంతో నౌక కదిలేందుకు వీలు లేకుండా పోయింది

మధ్య సముద్రంలోకి వెళ్లిన అనంతరం నౌక ఇంజిన్‌ ఫెయిల్‌ అయినట్లు పైలెట్లు గుర్తించారు. సముద్రంలోకి ఇంధనం లీకేజీ అవుతుండటంతో నౌక కదిలేందుకు వీలు పడలేదు. ఈ నేపథ్యంలోనే భారతీయ తీర ప్రాంత రక్షణ దళాల సహాయాన్ని కోరారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన నౌక సహాయంతో సదరు పరిశోధక నౌక ఉన్న ప్రాంతాన్ని కనుక్కున్నారు. ఈ క్రమంలోనే అక్కడి చేరుకపన్న (ICG) బృందం సహాయక చర్యలను ప్రారంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పరిశోధక నౌకను తీరానికి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గోవా తీరానికి తరలిస్తున్నామని శాస్త్రవేత్తలు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ICG డీఐజీ కేఎల్‌ అరుణ్‌ వివరించారు. పరిశోధన నిమిత్తం సైంటిస్టులు ఖరీదైన పరికరాలు, ఇతర సామగ్రిని కూడా తీసుకెళ్లారు.