NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా
    దత్తన్న అలయ్-బలయ్ ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా

    Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 20, 2023
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు.

    ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే తాము ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా అలయ్ - బలయ్ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాది ఆలయ్ - బలయ్ ఉంటుందన్నారు.

    ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ - బలయ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు విజయ లక్ష్మి పేర్కొన్నారు.

    details

    గత 17 ఏళ్లుగా అలయ్-బలాయ్ నిర్వహిస్తున్న బండారు దత్తత్రేయ ఫ్యామిలీ

    ప్రజలందరిలో సోదర సోదరీభావం నెలకొనాలని గత 17 సంవత్సరాల నుంచి తాము అలయ్ - బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని బండారు విజయలక్ష్మి చెప్పారు.

    ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, రాజకీయ అతిరథులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరత్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణతో పాటు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరి బాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డిలు హాజరుకానున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

    అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఈ అలయ్ - బలయ్ కార్యక్రమానికి ముఖ్య, విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని ఆమె వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    తెలంగాణ

    తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ
    తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన అసెంబ్లీ ఎన్నికలు
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    హైదరాబాద్

    Hyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్ తెలంగాణ
    ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు ఓలా
    గవర్నర్‌ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్  గవర్నర్
    అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025