LOADING...
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఊరటనిస్తూ అధికారులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడానికి ఈ అవకాశం ఉపయోగపడనుంది. అధికారుల ప్రకటన ప్రకారం, టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు మరో అవకాశం లభించనుంది. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాలి.

వివరాలు

5,26,965 మంది ఉత్తీర్ణత

నిర్ణీత గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఇక టెన్త్ ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశాన్ని కూడా కల్పించారు. ఇందుకు మే 1 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమగ్ర ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,18,131 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 5,26,965 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం పాస్ శాతం 85.25గా నమోదైంది. బాలుర ఉత్తీర్ణత శాతం 82.68 కాగా, బాలికలు 87.9 శాతం సాధించి మరోసారి తమ ప్రతిభను చాటారు.

Advertisement