LOADING...
Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం
Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం

Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఖిల భారత పులుల లెక్కింపు-2026 కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వామ్యం చేసుకోవాలని అటవీ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా వాలంటీర్లకు అవసరమైన అర్హతలు, మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వాలంటీర్ల వయసు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలని, రోజుకు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం అడవి ప్రదేశాల్లో నడిచే శారీరక సామర్థ్యం తప్పనిసరి అని వైల్డ్‌లైఫ్‌ పీసీసీఎఫ్‌ ఎలూసింగ్‌ మేరు తెలిపారు. పులులు,ఇతర వన్యప్రాణుల గణనలో పాల్గొనేటప్పుడు, వాలంటీర్లు అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఫీల్డ్‌లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు.

వివరాలు 

పులుల లెక్కింపు ఫీల్డ్ కార్యకలాపాలు జనవరి 17 నుంచి 23 వరకు

ఈ కార్యక్రమం పూర్తిగా సేవాతత్పరత ఆధారంగా ఉండే దాని ద్వారా ఎలాంటి భత్యాలు అందుబాటులో ఉండవని, అయితే అవసరమైన ప్రాథమిక సదుపాయాలను మాత్రం అటవీ శాఖ కల్పిస్తుందని స్పష్టం చేశారు. పులుల లెక్కింపు ఫీల్డ్ కార్యకలాపాలు జనవరి 17 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు నవంబర్ 22లోపు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040-23231440 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.