Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుండగా, ఈ విడతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27 లక్షల 41 వేల 70 మంది పురుషులు, 28 లక్షల 78 వేల 159 మంది మహిళలు, అలాగే 201 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు.
వివరాలు
పోలింగ్ కు సిద్ధం...
పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికలు సజావుగా జరగేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు మూసివేయనున్నారు. ఇక తొలి విడతలో భాగంగా ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ముగిశాయని ఎన్నికల అధికారులు తెలిపారు.