NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి
    నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి

    Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    08:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అల్లానా గ్రూప్ ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.

    ఇఫ్‌కో సంస్థతో కలిసి రాష్ట్రంలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

    ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నూజివీడు ప్రాంతంలో పౌల్ట్రీ, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించనుంది.

    దీని ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్-2025 సదస్సులో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఆహారశుద్ధి సొసైటీ సీఈఓ గడ్డం శేఖర్‌బాబు, అల్లానా/ఇఫ్‌కో గ్రూప్ ఎండీ ఇర్ఫాన్ అల్లానా, డైరెక్టర్ మోయిజ్ చినవాలా, సీఈఓ మనీష్ ములే ఈ పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశారు.

    వివరాలు 

    ఆహారశుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీలలో అల్లానా గ్రూప్ ఒకటి

    యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న అల్లానా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆహారశుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉంది.

    150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థకు 85 దేశాల్లో యూనిట్లు ఉన్నాయి.

    ఇదే సమయంలో, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు, పొలం నుంచి మార్కెట్‌ విధానాలను అభివృద్ధి చేయడానికి, సుస్థిర వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు చెందిన కిసాన్‌సే ఆగ్‌టెక్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

    దుబాయ్‌లో జరుగుతున్న ప్రపంచస్థాయి ఫుడ్‌షోలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

    ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనపై పలు ప్రముఖ సంస్థలతో చర్చలు నిర్వహిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం బడ్జెట్
    APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ ప్రభుత్వం
    CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే? చంద్రబాబు నాయుడు
    Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు భారత జట్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025