
AP Liquor Shops: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయింపు.. నోటిఫికేషన్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
గీత కార్మికులకు సంబంధించి 335 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఈ షాపులకు అప్లికేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీ ద్వారా లైసెన్స్ ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ప్రతి షాపుకు రూ.2 లక్షలు నాన్-రిఫండబుల్ ఫీజును నిర్ణయించారు.
Details
10శాతం షాపులు గీత కార్మికులకు కేటాయింపు
అభ్యర్థులకు ఆయా జిల్లాల పరిధిలోని అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.
కానీ ఒక్క అభ్యర్థికి ఒకే ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు.ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే, అభ్యర్థి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. లైసెన్స్ 2 సంవత్సరాలు పాటు ఉండనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, అక్టోబర్ నెలలో ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
వాటిలో 10శాతం షాపులు గీత కులాలకు కేటాయించనున్నాయి.
Details
తిరుపతి జిల్లాలో 23 షాపులు
తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకు కేటాయించారు.
ఇతర జిల్లాల్లో కూడా వివిధ సంఖ్యలో షాపులు కేటాయించనట్లు సమాచారం.
అల్లూరి సీతారామరాజు-1, అనంతపురం-14, శ్రీ సత్యసాయి-9, అన్నమయ్య-11, చిత్తూరు-10, తూర్పు గోదావరి-13, కాకినాడ-16, కోనసీమ-13, బాపట్ల-12, గుంటూరు-13, పల్నాడు-13, కడప-14, కృష్ణా-12, ఎన్టీఆర్-11, కర్నూలు-10, నంద్యాల-11, నెల్లూరు-18, ప్రకాశం-18
పార్వతీపురం మన్యం-4, శ్రీకాకుళం-18, అనకాపల్లి-15, విశాఖపట్నం-14, విజయనగరం-16, ఏలూరు-14, పశ్చిమగోదావరి-18 షాపులను గీత కార్మికుల కోసం కేటాయించినట్లు వెల్లడించారు.