NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ
    తదుపరి వార్తా కథనం
    హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ
    అమరావతి రైతుల పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

    హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది.

    అమరావతి రైతులు ఆర్-5 జోన్ పై దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అదే విధంగా ఇళ్ల పట్టాలపై పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది. దీంతో అమరావతి రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

    హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిందని, రాజధాని అవసరాల కోసం ఇచ్చిన భూములను ఇతరులకు ఇచ్చారని రైతులు ఆరోపించారు.ఆర్-5 జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రైతులు పిటిషన్ వేశారు.

    ఈపిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది.

    Details

    సుప్రీంకోర్టుకు వెళ్లనున్న రైతులు  

    రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్-5 జోన్ గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం 1134 ఎకరాలను కేటాయించింది.

    ఈ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పడంతో రైతులు శనివారం సుప్రీంకోర్టును అశ్రయించనున్నారు. అదే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయాలని రైతులు భావిస్తున్నారు.

    రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జోన్ పేరుతో సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది.

    ప్రస్తుతం రైతుల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమం అయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    హైకోర్టు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025