Amaravati High Court: అమరావతి హైకోర్టు నిర్మాణంలో రికార్డు.. 3,026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసిన సీఆర్డీఏ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు పోతున్నాయి. సీఆర్డీఏ యంత్రాంగం తన లక్ష్యాలను మించివేత్తూ రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా, హైకోర్టు భవనానికి 48 గంటలలోనే 3,026 క్యూబిక్ మీటర్ల భారీ కాంక్రీట్ భర్తీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ భారీ కాంక్రీట్ పనులు ఈ నెల 10వ తేదీ రాత్రి ప్రారంభమై, సోమవారం రాత్రికి పూర్తి అయ్యాయి. వందల మంది కార్మికులు షిఫ్టుల వారీగా ఎక్కడా విరామం లేకుండా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించారు. సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అధికారులకు, కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించారు.
వివరాలు
2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం
గతంలో నిలిచిపోయిన ఈ పనులను, ఐఐటీ నిపుణుల ధ్రువీకరణ పొందిన తర్వాతే సీఆర్డీఏ తిరిగి ప్రారంభించింది. పాత ప్రభుత్వకాలంలో నిలిచిపోయిన పనుల కారణంగా పునాదుల్లో చేరిన నీటిని పూర్తిగా తొలగించి, పటిష్టమైన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు వేగవంతంగా సాగాయి. ఈ భవనాన్ని నేలపాడు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, బేస్మెంట్తో సహా గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. భవనంలో మొత్తం 52 కోర్టు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం 2027 మార్చ్ నాటికి భవనాన్ని పూర్తిగా సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.