NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 
    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 
    భారతదేశం

    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 17, 2023 | 04:00 pm 1 నిమి చదవండి
    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 
    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

    జమ్ముకశ్మీర్‌లో 62రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌జీ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై 2023 ఆగస్టు 31న ముగుస్తుందని ప్రభుత్వం తెలిపింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ ట్రాక్ రెండింటికీ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 బ్రాంచ్‌లు, జేకే 90 బ్రాంచ్‌లు, యెస్ బ్యాంక్ 37 బ్రాంచ్‌లు, ఎస్‌బీఐ బ్యాంక్ 99 బ్రాంచ్‌లతో సహా దేశవ్యాప్తంగా 542 బ్యాంక్ బ్రాంచ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

    ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి

    ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌లో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్‌లో భాగంగా యాత్రికుల థంబ్ స్కాన్ తీసుకోబడుతుంది. మార్గదర్శకాల ప్రకారం, 13-70 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు అమర్‌నాథ్‌జీ యాత్ర 2023 కోసం నమోదు చేసుకోవచ్చు. అన్ని తీర్థయాత్రల కోసం ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6వారాలకు మించిన గర్భం ఉన్న స్త్రీలకు కూడా అనుమతి ఉండదు. యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జమ్ముకశ్మీర్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జమ్ముకశ్మీర్

    జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు  తాజా వార్తలు
    సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం  పాకిస్థాన్
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు తాజా వార్తలు
    జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఉగ్రవాదులు

    తాజా వార్తలు

    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్
    ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?  స్టాక్ మార్కెట్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023