NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?
    తదుపరి వార్తా కథనం
    CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?
    సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?

    CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2024
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సెన్సస్‌ బిల్డింగ్‌లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్) యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా జనన మరణాల నమోదు చేసుకోవచ్చు.

    రిజిస్ట్రేషన్ పనిని ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే సులభంగా పూర్తి చేసుకునే వీలుండటంతో, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, క్యూలలో నిలబడడం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి.

    సెన్సస్ ఇండియా 2021 సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ యాప్ వినియోగంపై స్పష్టమైన వివరాలు అందించారు. పుట్టిన, మరణించిన తేదీ నుండి 21 రోజులలోపు ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

    ఆలస్యంగా నమోదు చేయాలంటే, 22-30 రోజుల్లో రూ. 2, 31 రోజుల నుండి ఏడాదిలోపు రూ. 5 ఆలస్య రుసుము చెల్లించాలి.

    Details

    జనన మరణాల రేటు ను ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

    పాత సర్టిఫికెట్‌లకు రూ. 10 రుసుము నిర్ణయించారు.ఇది గరిష్ట రుసుముగా ఉంటుంది.

    ఈ అంశంపై అమిత్‌ షా మాట్లాడారు. ప్రజలు తమ రాష్ట్ర అధికారిక భాషలో ఎక్కడి నుంచైనా జనన మరణాల రిజిస్ట్రేషన్ చేయవచ్చని పేర్కొన్నారు.

    దేశవ్యాప్తంగా ప్రజలకు సౌకర్యవంతమైన ఈ యాప్ జనన మరణాల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు. జనాభా గణన ప్రక్రియలో సమాచారాన్ని సేకరించేందుకు మొబైల్ అప్లికేషన్లు కూడా ఉపయోగంలోకి తీసుకొస్తున్నామని అమిత్‌ షా తెలిపారు.

    తొలిసారిగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) సృష్టించనున్నట్లు ప్రకటించారు.

    ఇది శాంతిభద్రతలను మెరుగుపరచడంలో, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జనాభా గణన ప్రారంభ తేదీ, ఫార్మాట్ తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    కేంద్రమంత్రి

    తాజా

    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి
    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ

    అమిత్ షా

    India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం  మయన్మార్
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా తాజా వార్తలు
    Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా  అయోధ్య
    Rahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు   రాహుల్ గాంధీ

    కేంద్రమంత్రి

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025