Page Loader
Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

వ్రాసిన వారు Stalin
May 11, 2024
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిగులు బడ్జెట్​ రాష్ట్రమైన తెలంగాణ (Telangana)ను గత పాలకులు అప్పుల పాలు చేశారని కేంద్ర హోమంత్రి అమిత్​ షా (Amith shaw) మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్​ వచ్చిన అమిత్​ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరోసారి కేంద్రంల అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో బలం పుంజుకున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP) 10 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు లేవని తెలిపారు. తెలంగాణకు రామగుండం ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ సంస్థను నిర్మించి ఇచ్చామని, సమ్మక్క సారక్క ట్రైబల్​ యూనివర్సిటీని మంజూరు చేశామని తెలిపారు. ఇవిగాక ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను తెలంగాణకు ఇచ్చామని వివరించారు.

Amith Sha-Press Meet-Hyderabad

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: అమిత్​ షా

ఇక తెలంగాణలో కాంగ్రెస్​ అరాచక పాలన నడుస్తోందని అమిత్​ షా దుయ్యబట్టారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్​ పార్టీ దుష్ర్పచారం చేస్తుందని మండిపడ్డారు.