NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
    తదుపరి వార్తా కథనం
    అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
    ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం

    అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 09, 2023
    07:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు.

    తమ ప్రభుత్వం మైనార్టీలో లేదని, ఇలాంటి సందర్బాల్లోనే విపక్షాల బలమెంతో తెలుస్తుందన్నారు.

    ప్రధానిగా మోదీ పలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆగస్ట్ 9న మహాత్ముడు క్విట్ ఇండియా నినాదం ఎత్తుకున్నారని, ఇప్పుడు మళ్లీ మోదీ అదే క్విట్ I.N.D.I.A. నినాదాన్ని ఇస్తున్నారన్నారు.

    కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు, సభకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రజల ఆలోచనలు మళ్లించేందుకేనని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

    ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చినట్లు షా చెప్పారు.

    DETAILS

    నిజాయితీపరులం కాబట్టే ఒక్క ఓటుతో ఆనాడు ప్రభుత్వం పడిపోయింది : షా 

    పీవీ హయాంలో అవిశ్వాసం పెట్టినప్పుడు గెలిచినా, తర్వాత కాంగ్రెస్ నేతలు జైలుకెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు. మరోవైపు డబ్బులిచ్చి అవిశ్వాసాన్ని గెలిచారనే ఆరోపణలు వచ్చాయనే అంశాన్ని షా ప్రస్తావించారు.

    వాజపేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టారని, కానీ తాము నిజాయితీగా వ్యవహరించినట్లుగా చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే ఒకే ఒక్క ఓటుతో తమ ప్రభుత్వం పడిపోయిందన్నారు.

    ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని షా అన్నారు. తాము తాయిలాలు పంచబోమని, రుణమాఫీలపై తమకు నమ్మకం లేదని వివరించారు.

    రైతులెవ్వరు రుణాలు తీసుకోకుండా సాగుకు తామే సాయం అందిస్తున్నామన్నారు.యూపీఏ రూ.70 వేలకోట్ల రుణమాఫీ తాయిలాలు ఇచ్చిందన్నారు.

    డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో భాగంగా డబ్బులు జమ అవుతున్నాయని షా పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది: అమిత్ షా

    #WATCH | Union Home Minister Amit Shah on no-confidence motion debate in Lok Sabha

    "There is not a no-confidence in the PM and this government in the country...This no-confidence motion has been brought only to create a delusion" pic.twitter.com/LEjkJI7ufi

    — ANI (@ANI) August 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    లోక్‌సభ

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    లోక్‌సభ

    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025