NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!
    తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

    Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 10, 2025
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తును ప్రారంభించింది.

    లబ్ధిదారుల గణన, ఆర్థిక భారం లెక్కలను సిద్ధం చేస్తోంది. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు.

    తాజాగా, ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించడంతో, లబ్ధిదారులకు ఒక సంవత్సరం పాటు ఒక ఏడాది పథకం అమలు కానట్లే .

    అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

    వివరాలు 

    పథకం అమలు విధానం 

    ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చిన కూటమి ప్రభుత్వం, వైసీపీ హయాంలో రూ. 15,000 నుంచి పాఠశాల నిర్వహణ ఖర్చు పేరుతో కోత విధించిన విధానాన్ని సమీక్షిస్తోంది.

    వైసీపీ ప్రభుత్వం మొదట రూ. 14,000, ఆపై రూ. 13,000 మాత్రమే అందించగా, కూటమి నేతలు ఎలాంటి కోతలు లేకుండా రూ. 15,000 పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

    అయితే, జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని 2024లో అమలు చేయకుండా, 2025 జూన్‌లో ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    పథకం కోసం ఖర్చు - లెక్కలు 

    ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి అనుగుణంగా, అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    అయితే, ఈ పథకం అమలు ప్రక్రియ నాలుగు సంవత్సరాలకు పరిమితమవుతుంది, దీని వల్ల లబ్ధిదారులకు ఒక సంవత్సరం నిధులు కోత పడే అవకాశం ఉంది.

    2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

    ఇందులో 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనా వేసింది.

    ఈ పథకం అమలుకు రూ. 10,300 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాధమికంగా అంచనా.

    విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది.

    2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయింపునకు కసరత్తు జరుగుతోంది.

    వివరాలు 

    విధి విధానాలు - అర్హత నిబంధనలు 

    ప్రభుత్వం పథకానికి సంబంధించిన విధి విధానాలపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది.

    వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి మార్గదర్శకాలను సమీక్షించనుంది. గతంలో పథకానికి అనర్హులుగా ప్రకటించిన వారు:

    ఆదాయపన్ను చెల్లించేవారు

    తెల్ల రేషన్ కార్డు లేనివారు

    300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు

    కారు కలిగి ఉన్న కుటుంబాలు

    1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నివసించే అర్బన్ కుటుంబాలు

    ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిబంధనలను తొలగిస్తుందా, కొనసాగిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

    విద్యుత్ వినియోగం, కారు కలిగి ఉండటం వంటి నిబంధనలను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు అవే నిబంధనలు కొనసాగిస్తారా? లేక మినహాయింపులు ఇస్తారా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

    వివరాలు 

    తల్లికి వందనం - లబ్ధిదారుల ఎదురుచూపు 

    ప్రభుత్వం తల్లికి వందనం నిధులు 2025 జూన్‌లో ఖాతాల్లో జమ అవుతాయని ప్రకటించినా, అర్హత నిబంధనలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ఆంధ్రప్రదేశ్

    Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు భారతదేశం
    Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్ భారతదేశం
    NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు కేంద్ర ప్రభుత్వం
    DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ శ్రీకాకుళం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025