NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
    భారతదేశం

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 31, 2023, 11:07 am 0 నిమి చదవండి
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
    ఇండోర్ గుడిలో ప్రమాదం; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. బావిని కప్పడానికి ఇనుప రాడ్లతో కాంక్రీట్ స్లాబ్ వేసి బావి పైకప్పును నిర్మించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తులు ఒక్కసారి బావి పై కప్పు మీదకు రావడంతో.. కాంక్రీట్ స్లాబ్ కూలిపోయింది. ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీసినట్లు ఇండోర్ డివిజన్ కమిషనర్ పవన్ శర్మ వెల్లడించారు. మరో 18 మందిని రక్షించినట్లు తెలిపారు.

    ఆలయంలో ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం

    75 మంది ఆర్మీ సిబ్బందితో సహా 140 మంది బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండోర్ డివిజన్ కమిషనర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆలయంలో జరిగిన ప్రమాదంపై స్పందించారు. మృతుల పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. సీఎం శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బావిపై ఆలయ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారనే వివరాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    మధ్యప్రదేశ్
    శివరాజ్ సింగ్ చౌహాన్
    నరేంద్ర మోదీ
    ముఖ్యమంత్రి

    మధ్యప్రదేశ్

    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి ఇండోర్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు దక్షిణ ఆఫ్రికా

    శివరాజ్ సింగ్ చౌహాన్

    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు మధ్యప్రదేశ్

    నరేంద్ర మోదీ

    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం

    ముఖ్యమంత్రి

    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023