NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
    తదుపరి వార్తా కథనం
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
    ఇండోర్ గుడిలో ప్రమాదం; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

    వ్రాసిన వారు Stalin
    Mar 31, 2023
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.

    బావిని కప్పడానికి ఇనుప రాడ్లతో కాంక్రీట్ స్లాబ్ వేసి బావి పైకప్పును నిర్మించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తులు ఒక్కసారి బావి పై కప్పు మీదకు రావడంతో.. కాంక్రీట్ స్లాబ్ కూలిపోయింది.

    ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీసినట్లు ఇండోర్ డివిజన్ కమిషనర్ పవన్ శర్మ వెల్లడించారు. మరో 18 మందిని రక్షించినట్లు తెలిపారు.

    మధ్యప్రదేశ్

    ఆలయంలో ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం

    75 మంది ఆర్మీ సిబ్బందితో సహా 140 మంది బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండోర్ డివిజన్ కమిషనర్ తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆలయంలో జరిగిన ప్రమాదంపై స్పందించారు. మృతుల పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. సీఎం శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు.

    ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బావిపై ఆలయ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారనే వివరాలపై ఆరా తీశారు.

    మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఇండోర్
    తాజా వార్తలు

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    ఇండోర్

    INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్ క్రికెట్
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ తెలంగాణ
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం విద్యా శాఖ మంత్రి
    రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ
    'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025