NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 
    తదుపరి వార్తా కథనం
    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 
    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    04:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    కుమారుడి అరెస్టును అడ్డుకునేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. ఆమె కొడుకును బలవంతంగా కారులో తరలిస్తున్నారనే కారణంగా బానెట్‌పైకి దూసుకెళ్లింది.

    సదరు మహిళ కారు బానెట్ పై ఉండగానే పోలీసులు కారును అలాగే ముందుకు కదిలించారు.

    ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

    మధ్యప్రదేశ్‌కు చెందిన నార్సింగ్‌పుర్‌ పరిధిలోని గొటెగావ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గొటెగావ్‌లోని కొందరు వ్యక్తులు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    DETAILS

    ప్రజాగ్రహం పెల్లుబీకడంతో ముగ్గురు పోలీసులు సస్పెండ్

    దీంతో సదరు కాలనీకి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దిరిలో ఆ మహిళ కుమారుడు ఉన్నాడు.

    పూలు అమ్ముకొని బతికే ఆమె, కుమారుడి అరెస్టుతో ఆందోళనకు గరైంది. దీంతో వేగంగా పరుగెత్తుకొచ్చి కారు బానెట్‌పైకి దూకింది.

    తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అతడిని వదిలేయాలని అభ్యర్థించింది. పోలీసులు ఆమె మాటను అంగీకరించలేదు. దీంతో చేసేదేం లేక కారు బానెట్‌పైకి దూసుకెళ్లింది.అర కి.మీ దూరంలో ఉన్న ఠాణాకు పోలీసులు కారు ఆపకుండా అలాగే తీసుకెళ్లారు.

    స్థానికులు ఈ దృశ్యాలను ఫోన్‌ల్లో వీడియో తీశారు. అది కాస్త వైరల్ గా మారి ప్రజాగ్రహం పెల్లుబీకింది.

    దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025