NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్‌' ఉత్పత్తుల సందడి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్‌' ఉత్పత్తుల సందడి
    ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్‌' ఉత్పత్తుల సందడి

    Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్‌' ఉత్పత్తుల సందడి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 28, 2025
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతలో 14 స్టాళ్లు, రెండో విడతలో మరో 36 స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

    ఇప్పటికే సచివాలయం, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాల్లో మహిళా ఉత్పత్తుల స్టాళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

    ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ వీటిని ప్రారంభించి, రైలు ప్రయాణికులకు తెలంగాణ ఇంటి వంటల రుచులు పరిచయం చేయడంతో పాటు, ఇక్కడి చేనేత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ మేరకు మహిళా స్టాళ్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్యాదేవరాజన్‌, రైల్వేశాఖ అధికారులతో చర్చలు జరిపి, అనుమతి పొందారు.

    Details

     ప్రాథమికంగా కొన్ని స్టేషన్లలో ఉత్పత్తుల విభజన 

    సికింద్రాబాద్‌: పిండివంటల ఉత్పత్తులు - ఖమ్మం: సకినాలు, లడ్డూలు, కారప్పూస - సిర్పూర్‌: సకినాలు, మురుకులు, ఇతర ఉత్పత్తులు

    భద్రాచలం: పచ్చళ్లు- వరంగల్‌: చిరుధాన్యాలు - కరీంనగర్‌: చిరుధాన్యాల ఉత్పత్తులు

    ఘనాపూర్‌: చేతి ఉత్పత్తులు - శంకర్‌పల్లి: జూట్, క్లాత్‌ బ్యాగులు - వికారాబాద్‌: గాజులు, పూసలు, హారాలు

    చర్లపల్లి: మట్టి కప్పులు, నీళ్లసీసాలు, కడాయిలు - జనగామ: టవళ్లు, చేతిరుమాళ్లు - పోచంపల్లి: చేనేత ఉత్పత్తులు

    Details

     తెలంగాణ ఉత్పత్తులకు జాతీయ గుర్తింపు 

    రైల్వే స్టేషన్లలో మహిళా ఉత్పత్తుల స్టాళ్లు ప్రారంభించడం ద్వారా తెలంగాణ మహిళా సంఘాలు, వాటి ఉత్పత్తులకు దేశవ్యాప్త గుర్తింపు లభించే అవకాశం ఉందని సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్ తెలిపారు.

    రైలు ప్రయాణికుల ద్వారా వివిధ రాష్ట్రాలకు ఈ ఉత్పత్తుల గురించి ప్రచారం కూడా జరుగుతుందన్నారు.

    తద్వారా మహిళా సంఘాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రైల్వే స్టేషన్

    తాజా

    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నిలిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్
    Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్ కమల్ హాసన్

    తెలంగాణ

    Btech convener Quota: 15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటా రద్దు.. ఇకపై బీటెక్‌ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే? ప్రభుత్వం
    Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్! హైదరాబాద్
    Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ శ్రీశైలం
    Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి! విద్యుత్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025