NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు

    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

    ఆయిల్‌పామ్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రధానంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై చర్చించారు.

    పామాయిల్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని చెప్పారు.

    కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట కలిగిందని అన్నారు.

    ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి రూ.19,000కు పెరిగిందన్నారు.

    వివరాలు 

    కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర రూ.19,000 

    గత ప్రభుత్వ పాలనలో ఒక సందర్భంలో టన్నుకు రూ.23 వేల అత్యధిక ధర ఉన్నప్పుడు, కౌలు రైతులు ఇదే ధర కొనసాగుతుందని ఆశపడ్డారు.

    ముందుగానే ఎకరానికి రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చి కౌలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ధర రూ. 12 వేలకు తగ్గడంతో రైతులు నష్టపోయారు.

    కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర రూ.12,500 నుంచి రూ.19,000కు పెరిగింది.

    త్వరలో పామాయిల్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర అందుతుందని ఆశిస్తున్నారు.

    వివరాలు 

    ఏపీలో పామాయిల్ రైతులకు ఊరట 

    ప్రస్తుతం ఉన్న పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే టన్నుకు రూ.18 వేలు లేకపోతే గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు.

    పామాయిల్ ధర రూ.19,000 పలకడం సంతోషకరమని వారు పేర్కొన్నారు. పామాయిల్ సాగును విస్తరించాలని అధికారులు సూచించారు.

    అదేవిధంగా కేంద్రం కూడా పామాయిల్ రైతులకు తీపికబురు అందించింది. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 27.5% పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    ఈ నిర్ణయంతో పామాయిల్ పండించే రైతులకు లాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

    ఏపీలో పామాయిల్ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంతో ఊరట కలిగిందని అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు భారతదేశం
    Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం నారా లోకేశ్
    Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్ రోడ్డు ప్రమాదం
    Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025