LOADING...
Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..

Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. క్వాంటం వ్యాలీ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. సీడీ యాక్సెస్ రోడ్ పక్కన, సీఆర్డీఏ కార్యాలయ సమీపంలో భవన నిర్మాణానికి భూమి కేటాయింపు పూర్తయ్యింది. నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది. ఈ నెల 6న టెండర్ల దాఖలుద్వారా గడువు ముగుస్తుంది.

వివరాలు 

Z+1 ఫ్లోర్ గ్రీన్ బిల్డింగ్‌లో క్వాంటం భవన నిర్మాణం  

అయితే, శాశ్వత భవనం నిర్మాణం పూర్తి కాని వరకూ, రాజధానిలోని ఒక ప్రైవేట్ యూనివర్శిటీలో తాత్కాలికంగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ఈ సెంటర్‌ను రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు. ప్రతిపాదిత భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ విధానంలో Z+1 ఫ్లోర్ డిజైన్‌లో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 4,201 చదరపు మీటర్లు ఉండనుంది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ 1,990 చద.మీ., ఫస్ట్ ఫ్లోర్ 1,996 చద.మీ., బేస్‌మెంట్ 210 చద.మీ., అదనంగా హెడ్‌రూమ్ 109 చద.మీ. మరియు డెక్ ఏరియా 130 చద.మీటర్లుగా ఉంటాయి.

వివరాలు 

అమరావతిని జాతీయ క్వాంటం ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం

క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్ట్ అమలులో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మూడు సంస్థలతో సంబంధిత ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవన నిర్మాణ ఖర్చును సీఆర్డీఏ, ఐటీ అండ్ ఈ శాఖలు సంయుక్తంగా భరించనున్నట్లు టెండర్ నిబంధనల్లో పేర్కొన్నాయి. అంతే కాక, ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం టెక్నాలజీ పాలసీని విడుదల చేసి, అమరావతిని జాతీయ క్వాంటం ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం తీసుకుంది.

Advertisement