NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arogyasri: హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
    తదుపరి వార్తా కథనం
    Arogyasri: హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
    హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

    Arogyasri: హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 20, 2024
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది.హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    ఈ మేరకు కీలక ప్రకటన బయటకు వచ్చినట్లు సమాచారం.ఆరోగ్యశ్రీ ట్రస్టు రేంజ్ లో ఉన్న1.60 కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 నుంచి రూ.2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు.

    వార్షిక బీమా పరిమితి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందేవార్తు 97% వరకు ఉన్నారు.

    మిగితా 3% వారికి వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

    వివరాలు 

    రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు

    ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. వార్షిక పరిమితి కింద నిర్దేశించిన రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్‌ రోగులకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతోంది.

    రూ.2.5లక్షలు కాకుండా ఇప్పటివరకు అధికంగా నమోదైన కేసులు రూ.5 లక్షల వరకు ఖర్చయినవి ఉన్నాయి.

    వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి రూ.2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తుంది.

    వివరాలు 

    వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్‌ విధానం అమలు

    ఇప్పటికే ,మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో హైబ్రిడ్‌ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలో రూ.6 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది.

    ఇందులో రూ.1.5వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా.. ఆపైన అవసరమైతే ట్రస్టు ద్వారా చికిత్స అందిస్తున్నారు.

    జమ్మూకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయాలోనూ ఇది ఉంది.

    ట్రస్టు విధానాన్ని ఏపీతోపాటుగా ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్‌ తదితర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. బీమా సంస్థనుబట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యశ్రీ

    తాజా

    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి

    ఆరోగ్యశ్రీ

    తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు తెలంగాణ
    Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు తాజా వార్తలు
    Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025