NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్
    ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్

    AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది.

    ఈ కాలంలో సముద్ర జీవులు,ముఖ్యంగా చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి.

    వాటి వృద్ధికి సహాయపడేలా మోటార్ బోట్లు,ఇంజిన్ బోట్లను వేటకు అనుమతించరు.

    అయితే కేవలం చిన్న స్థాయి కర్ర తెప్పల వేటకు మాత్రం పరిమిత అనుమతులు ఉన్నాయి.

    నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.

    ఈ రెండు నెలల నిషేధ కాలంలో మత్స్య శాఖ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు.

    ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.

    వివరాలు 

    'మత్స్యకార భరోసా'

    అంతేకాదు, ప్రభుత్వ పథకాల లబ్ధి నుంచి కూడా వారిని బహిష్కరిస్తారు. అందువల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.

    వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోంది.

    గతంలో 40 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉండేది. తర్వాత దానిని 60రోజుల వరకు పెంచారు.

    ఆ కాలంలో మత్స్యకారులకు బియ్యాన్ని ఉచితంగా అందించేవారు.ఆ తరువాత ఈ పథకం 'మత్స్యకార భరోసా'గా మారింది.

    2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉచిత బియ్యం స్థానంలో ప్రతి అర్హత కలిగిన మత్స్యకారునికి రూ.2,000 ఆర్థిక సాయం ఇవ్వడం ప్రారంభించారు.

    తరువాత దీనిని రూ.4,000కి పెంచారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ భరోసా మొత్తాన్ని రూ.10,000కు పెంచారు.

    వివరాలు 

    లబ్ధిదారులను గుర్తించేలా సర్వే

    ఎన్నికల నేపథ్యంలో, తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులుకు చేపల వేట నిషేధ కాలంలో ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది.

    ఆ హామీ మేరకు ఈ సంవత్సరపు బడ్జెట్‌లో తగిన నిధులను కూడా కేటాయించారు.

    ప్రస్తుతం మే నెల లేదా ఈ నెలలోనే ఈ సహాయం మత్స్యకారులకు అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

    అయితే, ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.

    ప్రభుత్వ ఆదేశాలు రాగానే లబ్ధిదారులను గుర్తించేలా సర్వే నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి  భారతదేశం
    GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు భారతదేశం
    AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన భారతదేశం
    AP News: ఏపీ మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025