English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
    ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం

    Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.

    రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేందుకు ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను,వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

    ఈ ప్రణాళికకు 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం'గా పేరు పెట్టారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.

    ఇప్పటికే మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్‌ ఈ నియామకానికి ఆమోదం తెలిపారు.

    రాష్ట్రంలో 185 మదర్సాలు ఉన్నాయి,ప్రతి మదర్సాలో ముగ్గురు చొప్పున 555మంది విద్యావాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

    చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలుకు ఏడాదికి రూ.13కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

    దీనికి ఆర్థికశాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది.

    వివరాలు 

    ఏపీ రాష్ట్రంలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు

    కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు అనుమతించింది.

    ఈ ప్రకారం, ప్రతి తరగతిలో కనీసం 15మంది విద్యార్థులు ఉండాలి. ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో గౌరవ వేతనంతో ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది.

    గత ప్రభుత్వ హయాంలో దీనిని వినియోగించకపోయినా, కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను కేంద్రానికి పంపింది.

    ఏపీ రాష్ట్రంలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నట్లు గుర్తించారు.వీటిలో 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15 మందికి మించి విద్యార్థులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

    వెంటనే,ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు రూ.30,000 గౌరవ వేతనం చెల్లించేందుకు రూ.10 కోట్లు విడుదల చేసింది కేంద్రం.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    విద్యావాలంటీర్ల నియామకం 

    రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, అధికారులు నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు.

    2014-19 మధ్య, అప్పటి టీడీపీ ప్రభుత్వం మదర్సాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆధునిక విద్య అందించేందుకు విద్యావాలంటీర్లను నియమించింది.

    ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించలేదు.

    ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది.

    త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    లంబసింగ్ మ్యూజియం కోసం నిధులు విడుదల 

    ఇంకొకవైపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంబసింగి సమీపంలోని తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

    రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. మొత్తం రూ.35 కోట్లు ఖర్చు అవుతుంది, అందులో కేంద్రం వాటా రూ.15 కోట్లు, రాష్ట్ర వాటా రూ.20 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.6.75 కోట్లు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్
    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం! రాజస్థాన్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు పవన్ కళ్యాణ్
    Amarawati: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు.. క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్‌ పరిశీలన చంద్రబాబు నాయుడు
    AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం ఏమి చెప్పిందంటే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025