NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు
    తదుపరి వార్తా కథనం
    Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు

    Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    12:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడంలో కసరత్తు చేస్తోంది.

    సూపర్ సిక్స్ పథకాల్లో ముందుగా రెండు స్కీంలను అమలుకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మిగిలిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.

    అదే విధంగా, "అమ్మకు వందనం", "అన్నదాత సుఖీభవ" పథకాలకు నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.

    "అన్నదాత సుఖీభవ" పథకం కింద, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు కూటమి నేతలు హామీ ఇచ్చారు.

    గతంలో "రతు భరోసా" పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని "అన్నదాతా సుఖీభవ"గా పేరు మార్చారు.

    వివరాలు 

    అన్నదాతా సుఖీభవ

    ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులకు సహాయం అందించనున్నట్లు సమాచారం.

    పథకం అమలుకు విధివిధానాల రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు. నిజమైన సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, భూ యజమానులు, కౌలు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

    కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6,000తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 కలిపి, మొత్తంగా ఏటా రూ. 20,000 ఇవ్వాలని నిర్ణయించారు.

    వివరాలు 

    ప్రభుత్వం కసరత్తు 

    ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది.

    వచ్చే నెలలో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నది. ఆ బడ్జెట్‌లో సంక్షేమ పథకాల అమలుకు రూ. 20,000 కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

    "తల్లికి వందనం" పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేసి, మిగిలిన పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ఆలోచనలో ఉన్నారు.

    ఈ దీపావళి నుండీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

    ఇప్పటికే రూ. 4,000 పెన్షన్ అమలవుతోంది. దీంతో, ఈ రెండు పథకాల అమలుపైన ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆంధ్రప్రదేశ్

    Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Coffee: ఐదేళ్లలో కాఫీ సాగు విస్తరణ.. ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు భారతదేశం
    Indrakeeladri: అమ్మలగన్నమ్మ.. ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహత్యం విజయవాడ కనకదుర్గ గుడి
    Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025