NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ
    జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ

    Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి.

    పట్టణాలు,గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఆయా ప్రాంతాల అభివృద్ధి,ఇతర అంశాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న విలువలపై 10% నుంచి 15% వరకు పెంపు చేసే అవకాశం ఉంది.

    గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అసమానతలు లేకుండా, శాస్త్రీయ విధానంలో విలువల పెంపును చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

    రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ (స్ట్రక్చర్)విలువలను కూడా సవరించనున్నారు.

    జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో, నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసిన సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం పొందిన తర్వాత ఈ నెల 20న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచనున్నారు.

    వివరాలు 

    కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు

    జనసాధారణ నుంచి అభ్యంతరాలు, సూచనలు ఈ నెల 24 వరకు స్వీకరించనున్నారు.

    ఈ ప్రతిపాదనల పరిశీలనను ఈ నెల 27వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు.

    2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్,స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.

    అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

    గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల పెంపులో నిర్దిష్టమైన విధానాలు పాటించకపోవడంతో వచ్చిన అసమానతలను, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా తొలగించేందుకు కృషి జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: రూ.11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభానికి సీఆర్డీయే అథారిటీ ఆమోదం  భారతదేశం
    Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ .. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి  పుష్ప 2
    Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు కాకినాడ సిటీ
    AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి సచివాలయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025