NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
    తదుపరి వార్తా కథనం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
    జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక

    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది.

    ఈ నివేదికలో 10 ప్రధాన జలాశయాల వివరాలు వెల్లడించాయి. వాటిలో 8 జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గాయి.

    కేంద్ర జలసంఘం రూపొందించిన ఈ నివేదిక రిమోట్ సెన్సింగ్ సర్వేలు, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఆధారంగా సేకరించారు.

    శ్రీశైలంలో 45 సంవత్సరాల్లో మొత్తం 102.11 టీఎంసీల నీటి నిల్వ తగ్గింది.

    1976లో 308 టీఎంసీలు నిల్వ చేసిన శ్రీశైలం, 2021 సర్వే ప్రకారం 205.91 టీఎంసీలకు పడిపోయింది.

    Details

    కంభం చెరువులో 2.97 టీఎంసీల నీరు తగ్గింది

    కంభం చెరువులో 1956లో 3.73 టీఎంసీలు నిల్వ చేశారు, 1978 నాటికి 2.97 టీఎంసీలకు తగ్గింది.

    ఇక మైలవరం జలాశయంలో 1969లో 7 టీఎంసీలు నిల్వ చేయగా, 2021లో 0.76 టీఎంసీల మేర తగ్గి 6.24 టీఎంసీలకు చేరింది.

    రైవాడ జలాశయంలో 1982లో 3.59 టీఎంసీల నీటిని నిల్వ చేశారు, 2023 నాటికి 3.125 టీఎంసీలకు పడిపోయింది.

    రాళ్లపాడు చెరువులో 1958లో 1.106 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగి 2021 నాటికి 1.443 టీఎంసీలను చేరుకుంది.

    తాండవ జలాశయంలో 1975లో 4.96 టీఎంసీల నిల్వ, 2023 నాటికి 4.39 టీఎంసీలకు పడిపోయింది.

    Details

    నీటి సామర్థ్యంపై తీవ్ర ఆందోళన

    వంశధార ప్రాజెక్టులో 1977లో 0.66 టీఎంసీలు నిల్వ చేయగలిగితే, 2004 నాటికి 0.25 టీఎంసీలకు తగ్గింది.

    ఏలేరు జలాశయంలో 1991లో 24.10 టీఎంసీల నిల్వ, 2021 నాటికి 23.21 టీఎంసీలకు తగ్గింది.

    ఈ వివరాలు జలశయాల నిర్వహణ, వాటి పూడిక సమస్యలు, నీటి నిల్వ సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

    రాష్ట్రానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ అవసరమనే విషయాన్ని ఈ నివేదిక స్పష్టంగా నొక్కిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం
    రాష్ట్రం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం

    రాష్ట్రం

    Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ ఆధార్ కార్డ్
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణ
    Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం  తెలంగాణ
    Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025