NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
    తదుపరి వార్తా కథనం
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

    వ్రాసిన వారు Stalin
    May 09, 2023
    06:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆఫ్రికా దేశం నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన వచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని అధికారులు తెలిపారు.

    40 రోజుల్లో ఇది మూడో మరణంగా మంగళవారం పేర్కొన్నారు. కునో నేషనల్ పార్క్‌లో పర్యవేక్షణ బృందం మంగళవారం ఉదయం గాయపడిన స్థితిలో ఉన్న ఆడ చిరుత దక్షను గుర్తించిందని, వెంటనే అవసరమైన మందులు, చికిత్స అందించినట్లు చెప్పారు.

    కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ చిరుత మృతి చెందినట్లు అటవీ అధికారి ధృవీకరించారు. చిరుతల మధ్య జరిగిన ఘర్షణ వల్లే దక్ష గాయపడిందని అధికారులు చెప్పారు. అయితే ఇది సాధారణ విషయం అని తెలిపారు.

    చిరుత

    70 ఏళ్ల తర్వాత భారత్‌కు చిరుతల రాక

    70 సంవత్సరాల క్రితం దేశంలో కనుమరుగైన జాతులను పునరుద్ధరించే ప్రణాళిక భాగంగా సెప్టెంబర్, ఫిబ్రవరిలో మొత్తం 20 చిరుతలను విదేశాల్లో నుంచి కునో నేషనల్ పార్క్‌కు తరలించారు.

    గతంలో మార్చి 27న ఒక ఆడ చిరుత, ఏప్రిల్ 23న మగ చిరుత మృతి చెందాయి.

    ఈ మరణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆందోళన కలిగించినట్లు, అయితే మిగిలినవి బాగానే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

    మిగతా చిరుతలను నిశితంగా పరిశీలించామని, వాటిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా వార్తలు

    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  దిల్లీ
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? భారతదేశం
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025