NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
    భారతదేశం

    ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్

    ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 24, 2023, 06:07 pm 1 నిమి చదవండి
    ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
    ఎయిర్ ఇండియాకు రూ.10లక్షల ఫైన్ విధించిన డీజీసీఏ

    ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డీజీసీఏ మరోసారి షాక్ ఇచ్చింది. న్యూయార్క్-దిల్లీ వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ, తాజాగా అలాంటి సంఘటనలో రూ. 10లక్షల ఫైన్ విధించింది. వారం లోపలే ఎయిర్ ఇండియాకు ఈ రెండు ఫైన్లు విధించడం గమనార్హం. డిసెంబరు 6న ప్యారిస్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI-142 ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు తాగుబోతులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఒక ప్రయాణికుడు మహిళ దుప్పటిపై మూత్రవిసర్జన చేయగా.. మరొక ప్రయాణికుడు ధూమపానం చేశాడు.

    ఎయిర్ ఇండియా సమాధానానికి సంతృప్తి చెందని డీజీసీఏ

    జనవరి 5న తాము అడిగే వరకు ఎయిర్ ఇండియా AI-142లో జరిగిన ఘటన గురించి చెప్పకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని జనవరి 10న షోకాజు నోటీసు జారీ చేసింది. జనవరి 23లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. షోకాజు నోటీసుకు ప్రతిస్పందనగా ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సరిగా లేకపోవడంతో రూ.10లక్షల జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ చెప్పింది. అలాగే విమానయాన సంస్థకు ఫైన్ విధించిన డీజీసీఏ, అందులోని సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకునేది ఇలా వెల్లడించలేదు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ
    ఎయిర్ ఇండియా

    తాజా

    మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ టీమిండియా
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు ఖలిస్థానీ
    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఐఫోన్

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    ఎయిర్ ఇండియా

    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ కేరళ
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ కేరళ
    300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు విమానం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023