NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
    తదుపరి వార్తా కథనం
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
    ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    వ్రాసిన వారు Stalin
    Jan 20, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది.

    ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏవియేషన్ రెగ్యులేటర్ ఫ్లైట్ పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఇన్-ఫ్లైట్ సర్వీస్‌కు రూ. 3 లక్షల జరిమానా విధించింది.

    2022 నవంబర్ 26న న్యూయార్క్-దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం తాగి తనపై మూత్ర విసర్జన చేశాడని శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడిపై తోటి మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసింది. ఈకేసులో శంకర్ మిశ్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

    ఎయిర్ ఇండియా

    శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు నిషేధాన్ని విధించిన ఎయిర్ ఇండియా

    ఈ వ్యవహారానికి కారణమైన శంకర్‌మిశ్రా ఎయిర్ఇండియా ఎయిర్ లైన్స్ కూడా చర్యలు తీసుకుంది. నాలుగు నెలలపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. మిగతా విమానయాన సంస్థలు కూడా నిషధాన్ని విధించే అవకాశం ఉంది. విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారినా.. నిందితుడు శంకర్ మిశ్రా మాత్రం తాను ఆ పని చేయలేదని చెప్పడం గమనార్హం.

    మొదటిసారి నవంబర్ 27న ఎయిర్ ఇండియాకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. నవంబర్ 30న ఎయిర్ ఇండియా శంకర్ మిశ్రా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అప్పటిదాకా సంస్థాగతంగా జరిగిన ఈ వ్యవహారం, బాధిత మహిళ టాటా సన్స్ చైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో విషయం బహిరంగమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    దిల్లీ
    విమానం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025