NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్‌ లింకింగ్‌పై ఈసీ స్పష్టత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్‌ లింకింగ్‌పై ఈసీ స్పష్టత
    ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్‌ లింకింగ్‌పై ఈసీ స్పష్టత

    Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్‌ లింకింగ్‌పై ఈసీ స్పష్టత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 19, 2025
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలోనే ఓటర్‌ ఐడీని ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

    ఓటర్‌ ఐడీ, ఆధార్‌ అనుసంధానం ప్రాముఖ్యత, సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈసీ సభ్యులు డాక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, డాక్టర్‌ వివేక్‌ జోషీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

    Details

    రాజ్యాంగపరమైన అనుసంధానం 

    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ప్రకారం, భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని సమావేశంలో స్పష్టంచేశారు.

    ఓటర్‌ ఐడీ, ఆధార్‌ అనుసంధానం ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉండాలని నిర్ణయించారు.

    ఈ ప్రక్రియలో ఉన్న సాంకేతిక అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు UIDAI అధికారులతో మరో కీలక సమావేశం త్వరలో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

    Details

     ఎన్నికల సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలు 

    ఇటీవల ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సరైన నిర్వహణపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడంతో, కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది.

    ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించింది.

    ఏప్రిల్‌ 30 నాటికి ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఇండియా

    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు! ఐసీసీ
    UGC NET Results out: యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల - అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎంతో తెలుసా? భారతదేశం
    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్‌.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025