తదుపరి వార్తా కథనం
Maoist: మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 18, 2025
11:16 am
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో మావోయిస్టుల కీలక నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
వివరాలు
ఛత్తీస్గఢ్లో మరో ఘటన
ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కూడా సమాన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఇంకా ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.